పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్ పరీక్ష జరుగనుంది. నిజానికి ఈ విధానాన్ని గతేడాదే అమలు చేయాలని భావించినా.. పరీక్షలు రద్దు కావడంతో ఈ విధానం అమలు కాలేదు.
ప్రస్తుతం పూర్తిస్థాయిలో పాఠశాలలు ఓపెన్ కాకపోవడంతో వచ్చే పది పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈసారి పది పరిక్షల సమయం అరగంట పెంచాలని కూడా నిర్ణయించింది. ఒక్కో పరీక్ష 3గంటల 15 నిముషాలపాటు జరుగనుంది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉండబోతున్నాయి. ప్రశ్నల్లో మరిన్ని చాయిస్ లు కూడా ఉండబోతున్నాయి. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్ఏ పరీక్షలకు 20 మార్కులు కేటాయించబోతున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా 1 నుంచి 10 తరగతులకు 70 శాతం సిలబస్ మాత్రమే బోధించాలని కూడా నిర్ణయించింది.
716055 794464Seriously really great contribution, I truly depend on up-dates of your stuff. 348525
738394 107530I was looking at some of your weblog posts on this internet site and I believe this web internet site is real instructive! Keep posting . 213781