Switch to English

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.!

టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీలో టీడీపీ – జనసేన అనుకూల వర్గం, వైసీపీ అనుకూల వర్గం.. అనేవి వున్నాయి. నిజానికి టీడీపీ అనుకూల, బీజేపీ అనుకూల, జనసేన అనుకూల, వైపీపీ అనుకూల.. అనే నాలుగు వర్గాలుండేవి.

నిఖార్సయిన బీజేపీ వర్గం, అధినాయకత్వం చెప్పినట్లుగా టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇందులో వింతేమీ లేదు. వైసీపీ అనుకూల వర్గమే, టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.

ట్వీట్ల పరంగా కావొచ్చు, స్పేస్‌ల పరంగా కావొచ్చు, బీజేపీ అభ్యర్థుల మీదనే, బీజేపీలోని వైసీపీ వర్గం అత్యంత జుగుప్సాకరమైన నెగెటివిటీ షురూ చేసింది. ప్రధానంగా రాజమండ్రి కూటమి అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై ఈ వర్గం చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు నామమాత్రం. అంటే, ఒకటి నుంచి రెండు శాతమే. కానీ, బీజేపీకి ఆరు లోక్ సభ సీట్లు కూటమి తరఫున దక్కాయి. పది అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ పొత్తులో భాగంగా దక్కించుకుంది. వీటిల్లో ఎన్ని గెలుస్తుంది బీజేపీ.? అంటే, అది జనసేన – టీడీపీ దయ మీద ఆధారపడి వుంటుందన్నది బహిరంగ రహస్యం.

పొత్తుల్లో కొన్ని ఈక్వేషన్స్ వుంటాయి. అవన్నీ ఆయా పార్టీల అధినాయకత్వాలకి తెలుసు. క్యాడర్ కూడా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతుంటుంది. కానీ, బీజేపీలోని వైసీపీ వర్గం మాత్రం, సర్దుకోలేకపోతోంది.. జీర్ణించుకోలేకపోతోంది కూటమిని.

ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రిలో పురంధేశ్వరిని గెలవనివ్వబోమని సోకాల్డ్ ఇంటర్నెట్ మేధావులైన కమలం కార్మికులు శపథాలు చేసేస్తున్నారు. వాటిని బీజేపీ అధినాయకత్వం పట్టించుకోదనుకోండి.. అది వేరే సంగతి. కాకపోతే, బీజేపీ ముసుగేసుకుని, కూటమిని విమర్శిస్తున్నవారి వల్ల, బీజేపీ అభ్యర్థులకు కూటమిలోని ఇతర పార్టీల నుంచి ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సజావుగా సాగకపోవచ్చు.

ఆల్రెడీ కూటమికి దక్కాల్సిన సీట్లు కాస్తా, బీజేపీకి కేటాయించడంతో.. బీజేపీ ఓటమి అంటే వైసీపీ గెలుపు.. అన్నట్లుగా మారుతుందేమో పరిస్థితి అని టీడీపీ, జనసేన ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

ఏదిఏమైనా బీజేపీలోని వైసీపీ వర్గం పట్ల బీజేపీ అధినాయకత్వం ఒకింత అప్రమత్తంగా వుండాలి. లేదంటే అది కూటమికి చేటు తెస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న దరిమిలా, అప్పటికైనా ఈ గందరగోళం చల్లారుతుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...