Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు అనే మాటను నిజం చేస్తూ ఓటు ప్రాధాన్యత తెలిపే సంఘటన కేరళ (Kerala)లో జరిగింది.
ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒకేఒక్క ఓటరు ఓటు కోసం పోలింగ్ సిబ్బంది ఏకంగా 18కిలోమీటర్లు వెళ్లడం ఇందుకు నిదర్శనం. దట్టమైన అడవిలోని ఓ కుగ్రామంలో ఉంటున్న శివలింగం అనే 92ఏళ్ల వృద్ధుడు ఓటు వేయాలనే బలమైన సంకల్పంతో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలింగ్ సిబ్బంది (3మహిళలతో సహా 9మంది) ఉదయం ఆరింటికే బయలుదేరి రవాణా సదుపాయం ఉన్నంతవరకూ వెళ్లారు. అక్కడి నుంచి కాలినడకన కొండలు, సెలయేళ్లు దాటి శివలింగం ఉన్నచోటికి వెళ్లారు.
మధ్యాహ్నానికి గ్రామం చేరుకోగా మంచానికే పరిమితమైన శివలింగం కోసం అక్కడే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయగా.. తన మనవడి సాయంతో ఓటు వేశారు. ఈ సందర్భాం శివలింగం పోలింగ్ సిబ్బందికి కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు.