వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక ఇంకెవరికి దక్కుతుంది.? అసలు షర్మిల, రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదంటూ వైఎస్ జగన్ తల్లి విజయమ్మని అవమానించిన నాయకులున్నారు వైసీపీలో.!
సొంత కుటుంబంలో రక్త సంబంధాల్నే ఇంతలా అవమానించిన వైసీపీ మూకలు, ఇంకెవర్నయినా బతకనిస్తారా.? అసలు వైసీపీ రాజ్యాంగమేంటో, వైసీపీ మూకలకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారోగానీ, సభ్య సమాజాన్ని అస్సలు బతకనిచ్చే పరిస్థితే కనిపించడంలేదు వైసీపీ పాలనలో.!
మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారు.? తనకు అత్యంత సన్నిహితులైన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, సీఎం రమేష్.. ఎన్నికల బరిలో వున్నారు.. వారిని గెలిపించండి.. అని పిలుపునిచ్చారంతే. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని చెప్పే అవకాశం వుంది కదా.?
ప్చ్.. ఇది వైసీపీ రాజ్యాంగం.! ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది.? వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్నే (తల్లి, చెల్లి) వదలడంలేదు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చిరంజీవిని వదులుతారా.? మూక దాడి షురూ అయ్యింది. అత్యంత అసభ్యకరంగా బూతు పురాణం షురూ చేశారు వైసీపీ మద్దతుదారులు.
ఇంతా చేసి, ఇదేమన్నా వైసీపీకి లాభమా.? ఛాన్సే లేదు.! వైసీపీలోనే చాలామంది ఈ తీరు పట్ల విస్తుపోతున్నారు. తమ పార్టీ కనుసన్నల్లో తయారవుతున్న అల్లరి మూకలు, ఇంతలా సభ్య సమాజం మీద విరుచుకుపడుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు.
వైసీపీని నేతలు ఎందుకు వీడుతున్నారంటే, వాళ్ళు చెబుతున్న కారణమొక్కటే. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడితేనే టిక్కెట్లు..’ అని వైసీపీ అధినాయకత్వం షరతులు పెడుతోందిట. నాయకులకే ఇలాంటి షరతులు పెడితే, వైసీపీ పెంచి పోషిస్తున్న మూక పరిస్థితేంటి.?
సమాజానికి వైసీపీ అత్యంత హానికరం.. అనే మెసేజ్, వైసీపీ మూకలు, చిరంజీవిపై చేస్తున్న బూతుల దాడితో ఇంకోసారి నిరూపితమయ్యింది. నిన్న మొన్నటిదాకా ఒకరిద్దరు మెగాభిమానులెవరన్నా వైసీపీ పట్ల కాస్త సానుకూలంగా వుంటే, ఆ అవకాశమూ ఇప్పుడు వైసీపీకి లేకుండా పోయింది.!
ఈ పద్ధతి నచ్చక, రేప్పొద్దున్న వైఎస్ జగన్ సతీమణి భారతి ఏమైనా వైసీపీకి ఎదురు తిరిగితే, ఆమెకీ షర్మిల తరహాలోనే వైసీపీ మూకల ట్రీట్మెంట్ వుంటుందా.? ఏమో, అంతేనేమో… అంటూ వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. రాజకీయమంటే, ప్రజా సేవ.! కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే ‘మూక దాడులు’.!
అత్యంత అసభ్యకరమైన రీతిలో, అసహ్యకరమైన రీతిలో వైసీపీ చేస్తున్న రాజకీయం.. నిజంగానే సభ్య సమాజానికి అత్యంత హానికరం.! వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే అవకాశం లేనప్పుడు.. అది ప్రజాస్వామ్యమెలా అవుతుంది.? ఈ మాత్రం ఇంగితం వుంటే, అది వైసీపీ ఎలా అవుతుంది.?