Switch to English

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు జరిపి దాని ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఉన్న ప్రచార సంప్రదాయానికి పాతరేసి కొత్త పోకడలకు తెరతీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల వేళ పార్టీలకు కర్త, క్రియ,కర్మ అన్నీ వారే.

అలా మొదలైంది ప్రశాంత్ కిషోర్ తోనే…

ప్రచార కర్తల సంప్రదాయం మొదలైంది ప్రశాంత్ కిషోర్ తోనే. పదేళ్ల క్రితం ఆయన సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్( CAG) ని స్టార్ట్ చేశారు. రెండేళ్ల తర్వాత అది ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( I-PAC) గా మారింది. 2014 నుంచి ఈ సంస్థ పలు ఎన్నికల్లో పార్టీల తరఫున వ్యూహాలు రచించడం ప్రారంభించింది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పనిచేసే ఆ పార్టీ 282 సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల్లో బీజేపీ ఫాలో అయిన చాయ్ పే చర్చ, బ్రాండ్ మోదీ, ఐక్యత ఉద్యమం, మోదీని వికాస పురుషుడిగా అభివర్ణిస్తూ ఏర్పాటుచేసిన త్రీడీ హోలోగ్రామ్ ర్యాలీలు సూపర్ హిట్ అయ్యాయి. అవన్నీ ఐపాక్ డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సిపి తరఫున ఐపాక్ టీమ్ పనిచేసింది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ 150 సీట్లు గెలుచుకోవడంలో ఈ టీం కీలకపాత్ర పోషించింది. ఆంధ్ర లో అమలు చేసిన నవరత్నాలు వీళ్ల ఐడియా నే.

రీసెంట్ సెన్సేషన్ సునీల్ కనుగోలు

రాజకీయ వ్యూహకర్తల్లో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సునీల్ కనుగోలు. ఈయన తొలుత బీజేపీ తరఫున వ్యూహకర్త గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో జతకట్టి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘భారత్ జోడో యాత్ర’ సూపర్ హిట్ అవ్వడంతో సునీల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో ఆయన పేరు మారుమోగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్ తన హామీల్లో చేర్చడం వీళ్ల వ్యూహమే. అవి ఓటర్లను ఎంతగానో ఆకర్షించి కాంగ్రెస్ కి అధికారాన్ని కట్టబెట్టాయి.

పార్థ ప్రతిమ్ దాస్ ‘సోషల్’ దారి

దేశ రాజకీయ వ్యూహకర్తల్లో చెప్పుకోదగ్గ మరో వ్యక్తి పార్థ ప్రతిమ్ దాస్. ఈయన రూటే సపరేట్. సోషల్ మీడియాని ఉపయోగించుకొని వ్యూహాలు రచించడం ఈయన ప్రత్యేకత. ఆయన పని చేసే ప్రాంతాన్ని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి వ్యూహాలు రచిస్తుంటారు. ఉదాహరణకు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పార్టీ కోసం పనిచేస్తున్నారంటే ముందుగా ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్, ఆర్థిక పరిస్థితులు, అక్షరాస్యత, టెక్నాలజీ వాడకం ఆలోచన విధానాలను స్టడీ చేస్తారు. దాన్ని బట్టి తదుపరి వ్యూహాలను రచిస్తారు. ఈయన 2013లో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేశారు. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికలకు బీజేపీ కోసం పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...