ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం కలిసి పనిచేయడం శుభపరిణామం అన్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్ లో మెగాస్టార్ ని కలిశారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా నిలవాలని కోరుతూ చిరంజీవి ఓ వీడియోని రిలీజ్ చేశారు.
‘ తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు. పంచకర్ల రమేష్ నా బ్లెస్సింగ్స్ తో రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తి. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు. నాకు బాగా కావాల్సినవారు. సమర్ధులు. వీరిని గెలిపించండి. వీరి సమర్థతతో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా. సీఎం రమేష్ కి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. అనకాపల్లి అభివృద్ధికి అవి ఎంతగానో తోడ్పడతాయి. మీ అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలన్నది నా కోరిక. అందుకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను’ అని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేను సైతం అంటూ కూటమిలో భాగం గా పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పోటీదారు పంచకర్ల రమేష్ బాబు గారు, bjp mp కంటెస్టెంట్ CM రమేష్ గారికి మర్ధతి తెలిపిన మెగా స్టార్ చిరంజీవి గారు ! @KChiruTweets @PawanKalyan @CMRamesh_MP @JanaSenaParty pic.twitter.com/A1n04sfOWt
— Panchakarla Ramesh Babu (@PanchakarlaBabu) April 20, 2024