Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. మాదాపూర్లో యోదా డయాగ్నోస్టిక్స్ (Yoda Diognastics) కొత్త బ్రాంచ్ను చిరంజీవి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజ నరసింహ (Damodar Raja Narasimha) పాల్గొన్నారు.
అనంతరం కార్యక్రమంలో.. ‘ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ పేద వారికి ఎంతవరకూ ఉపయోగపడుతుంద’నే ప్రశ్నకు చిరంజీవి సమాధానమిస్తూ.. ‘ఇదే ప్రశ్న అమీర్ పేట బ్రాంచ్ ప్రారంభించినప్పుడూ అడిగాను. అన్నయ్యా.. మన సినిమా వారందరికీ హెల్త్ కార్డు ఇస్తాను.. వాటితో అతి తక్కువ ధరలకే ఇక్కడ అన్ని టెస్టులు చేయించుకోవచ్చు అన్నాడు. తమ్ముడులాంటి సుధాకర్ మాటలు నాలో స్ఫూర్తి కలిగించాయి.
‘దీంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్టుతో యోదా డయాగ్నొస్టిక్స్ అనుసంధానించి 14వేల మంది సినీ కార్మికులకు, వారి కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. ఇప్పుడు యుట్యూబర్స్, ఇన్ ఫ్లూయెన్సెర్స్ కి కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తున్నా’మన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి కార్డులు అందజేశారు.