Coromandel Express Accident : ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 నుంచి 100 మంది మృతి చెంది ఉంటారు అంటూ భావించారు. కానీ మృతుల సంఖ్య ఏకంగా 233 కి పెరిగింది. వెయ్యి మందికి పైగా గాయాలు అయ్యాయి.
బాలేశ్వర్ కు సమీపంలో బహానగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ తో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించిన విషయం తెల్సిందే. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అంటూ రైల్వే శాఖ ప్రాథమిక నిర్థారణకు రావడం జరిగింది.
ప్రమాదం జరిగిన తీరు మరియు కారణాలపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం వరకు మృతుల సంఖ్య విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.