Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్ని సినిమా నటుడిగా అభిమానించే జనసైనికులు, జనసేనానిగా పవన్ కళ్యాణ్ని రాజకీయాల్లోనూ అభిమానిస్తారుగానీ.. రాజకీయ పరమైన చైతన్యం విషయంలో కాస్త వెనకబడి వున్నారు నిన్న మొన్నటిదాకా.
కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రాజకీయ అంశాలపై జనసైనికులకి అవగాహన పెరిగింది. ప్రజల్లో వుండడం, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా వుండడం.. ఈ విషయాల్లో జనసైనికులు ఆరితేరారు. త్వరలో జనసేనాని వారాహి యాత్ర ప్రారంభించనున్న దరిమిలా, అటు జనంలో.. ఇటు సోషల్ మీడియాలో జనసైనికులు మరింత యాక్టివ్ అయ్యారు.
ముల్లుని ముల్లుతోనే తీయాలన్న చందంగా, అధికార వైసీపీ అరాచకాల్ని సోషల్ మీడియా వేదికగా, వారి పద్ధతిలోనే ఎలివేట్ చేస్తున్నారు. ఫేక్, మార్ఫింగ్.. ఇలా సరికొత్త తంత్రాలతో వైసీపీ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ వైసీపీకి అదే బాటలో సమాధానం చెబుతున్నారు జనసైనికులు.
ప్రధానంగా వైసీపీలో ఇప్పుడున్న నేతల ఒకప్పటి చరిత్రని జనసైనికులు కథలు కథలుగా తెరపైకి తెస్తున్నారు. గతంలో వారు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్ని ససాక్ష్యంగా నిరూపిస్తున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన గెలిచి వుంటే రాష్ట్రం ఎలా వుండేది, వైసీపీ గెలవడం వల్ల రాష్ట్రం ఎలా తయారయ్యింది.? వంటి అంశాలపైనా డాక్యుమెంటరీల్ని వీడియోల రూపంలో తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. జనానికి అర్థమయ్యేలా చేస్తున్నారు.
ఈ మార్పు జనసేనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.