2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి.. ఇలా ప్రముఖుల నుంచి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అందుతున్నాయి. అటు ప్రధాని మోడీకీ, ఇటు చిరంజీవికీ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి బూతుల కామెంట్లు విపరీతంగా వచ్చిపడుతున్నాయంటే ఏ స్థాయిలో వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
నారా చంద్రబాబునాయుడికి గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈసారి ఎందుకు మానేశారు.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు.! ఆ స్థాయిలో చంద్రబాబు మీద వైఎస్ జగన్ కక్ష పెంచుకున్నారంతే.
పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే, ఆ వ్యక్తి పట్ల సానుకూలత వున్నట్లు కాదు. రాజకీయాల్లో అసలు శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. ఆ మాటకొస్తే, రాజకీయమంటే సేవ. ఎవరెంత బాగా ప్రజలకు సేవ చేస్తారన్నదే రాజకీయాల్లో చర్చనీయాంశమవ్వాలి.
ఇక, చిరంజీవి విషయానికొస్తే.. ఆయన అందరివాడు. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పట్ల ‘సీనియర్ పొలిటీషియన్’ అన్న గౌరవం చిరంజీవికి వుండి వుండొచ్చు. ఇప్పుడు చిరంజీవికి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి. అది రాజకీయాల్లో చిరంజీవి వున్నప్పటి మాట.
రాజకీయ విమర్శలు వేరు, పుట్టిన రోజు శుభాకాంక్షల వ్యవహారం వేరు. అయినా, చిరంజీవి మీద వైసీపీ గ్రామ సింహాలు మొరిగితే, చిరంజీవి అనే ఏనుగు పట్టించుకుంటుందా.? ఛాన్సే లేదు. చిరంజీవిని వైసీపీ మద్దతుదారులతో వైఎస్ జగన్ తిట్టిస్తే, తద్వారా వైసీపీకి వచ్చే లాభమేంటి.? అదీ లేదు.!
పైశాచికానందం తప్ప, వైసీపీ గ్రామ సింహాలు సోషల్ మీడియాలో మొరగడంలో అసలంటూ అర్థమే లేదు. పొరపాటున వైఎస్ జగన్ గనుక, చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే, ఈ వైసీపీ గ్రామ సింహాలు ఏమైపోతాయ్.? వైసీపీకి గుడ్ బై చెప్పేస్తాయా.?