ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది.
ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మరోవైపు ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.