రాష్ట్రంలో గత ఏడాది సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో కదలిక వచ్చింది. ఈ దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ నేరస్తుడిని విచారిస్తుండగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఇదే జిల్లాకు చెందిన బాలకృష్ణ ఈ దొంగతనం చేసినట్టు సమాచారం.
వెండి సింహాలను తానే అపహరించానని నిందితుడు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అపహరించిన వెండి విగ్రహాలను తునిలో జ్యూయలరీ షాపులో విక్రయించినట్లు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విగ్రహాలు 16 కిలోల బరువున్నట్టు వ్యాపారి చెప్తున్నాడని అంటున్నారు.
మొత్తం మూడు వెండి విగ్రహాలను షాపు యజమాని కరిగించాడని అంటున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో షాపు యజమాని, నిందితుడు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరినీ మరో మూడు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. వీరి అరెస్టును పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు.
455250 109844This design is steller! You surely know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Amazing job. I truly enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool! 74618