Switch to English

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలే.!

2019 ఎన్నికల సమయంలో వైసీపీ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది. అప్పట్లో చాలామంది టీడీపీ, జనసేన అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. క్యాడర్ కూడా అలాగే ఆందోళన చెందింది. ఈ గందరగోళం, వైసీపీకి అప్పట్లో బాగా కలిసొచ్చింది.

ఇప్పుడు ఈ తరహా ప్రచారం వైసీపీ కొంప ముంచుతోంది. పిఠాపురం (అసెంబ్లీ) వైసీపీ అబ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత, జనసేనలోకి వెళతారన్న ప్రచారం ఈనాటిది కాదు. కాకినాడ ఎంపీ టిక్కెట్ రెండో సారి ఆమెకు కేటాయించకపోవడంతో, ఆమె పార్టీ మారుతున్నారని గతంలోనే పుకార్లు షికార్లు చేశాయి.

వాస్తవానికి, వంగా గీత అనుచరులే, ఈ లీకులకు ఆస్కారమిచ్చారు. పార్టీ అధినాయకత్వం బుజ్జగింపులతో వంగా గీత మెత్తబడ్డారు, వైసీపీలోనే కొనసాగారు. అయితే, పిఠాపురంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంగా గీత ఒకింత అయోమయంలో పడ్డారన్నది నిర్వివాదాంశం.

జనాల్లోకి వెళితే, ‘మా ఓటు జనసేనాని పవన్ కళ్యాణ్‌కే’ అన్న సమాధానం వస్తోంది వంగా గీతకి. దాంతో, వంగా గీత ఒకింత నొచ్చుకుంటున్నారు. ‘నేను లోకల్’ అని వంగా గీత చెబుతున్నారుగానీ, ‘ఐదేళ్ళు ఎంపీగా వుండి ఏం చేశావ్.?’ అని వంగా గీతని పిఠాపురం ‘లోకల్’ జనాలు నిలదీస్తున్నారాయె.

వైసీపీ అధినాయకత్వం ముందుగా హామీ ఇచ్చినట్లుగా మిధున్ రెడ్డి కావొచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావొచ్చు.. వీళ్ళెవరూ, పిఠాపురంలో తనకు మద్దతుగా వుండటంలేదని వంగా గీత అంతర్మధనం చెందుతున్నారు. వంగా గీత అనుచరగణం ఈ విషయమై బాహాటంగానే గుస్సా అవుతున్నారట.

‘జనసేనలోకి వెళ్ళిపోతున్నాం..’ అంటూ వంగా గీత అనుచరగణం, లీకులు ఇస్తోంటే, దానికి జనసేన ఒకింత అదనపు ఎలివేషన్ ఇస్తోందంతే.! ఈ లీకుల్ని బ్లాక్‌మెయిల్‌గా వైసీపీ అధినాయకత్వం భావిస్తోందిట. దాంతో, వంగా గీతకు క్రమంగా సపోర్ట్ తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేనలోకి వెళ్ళే ఉద్దేశ్యం వంగా గీతకు లేకపోయినా, పరిస్థితులు ఆమెను జనసేన వైపుగా నడిపించే అవకాశాలైతే బాగానే కనిపిస్తున్నాయ్. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఒకవేళ వంగా గీత గనుక, పార్టీ మారితే.. అదీ, ఎన్నికల ముందర ఆమె కీలక నిర్ణయం తీసుకుంటే.. వైసీపీకి అది చావు దెబ్బ అవుతుందన్నది నిర్వివాదాంశం.

వంగా గీత మాత్రమే కాదు, చలమలశెట్టి సునీల్ విషయంలోనూ అదే జరుగుతోంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీలో వున్న చలమలశెట్టి సునీల్, తనకు ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవని భావించి, ఎన్నికల ప్రచారంలో ఖర్చుని బాగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్.. నాలుగోసారీ ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఓడిపోవడం కంటే, ముందే హుందాగా పోటీ నుంచి తప్పుకోవడం బెటరని చలమలశెట్టి సునీల్ కూడా భావిస్తారా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...