Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన పిఠాపురం రానున్నారనే వార్త వైరల్ చేస్తున్నారు.
అయితే.. ఈ వార్తలో ఏటువంటి నిజంలేదని తెలుగు బులెటిన్ కు విశ్వసనీయమైన సమాచారం అందింది. చిరంజీవిపై ఏటువంటి అవకాశం వదులుకోని కొందరు తమ ఉనికి కోసం చేసుకుంటున్న ప్రచారంగా తేలింది.
ఇటీవలే జనసేన పార్టీకి చిరంజీవి రూ.5కోట్ల విరాళం అందించారు. తమ్ముడి విజయాన్ని కాంక్షించారు. సీఎం రమేశ్, పంచకర్ల రమేష్ గురించి ఒక వీడియోలో కూడా మాట్లాడారు. దీంతో చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలతోనే బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర లో నటిస్తున్నారు.