కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది ఆయన పార్టీ.!
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణని లేపేసి, భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీయార్, ప్రస్తుతం తెలంగాణలోనే పార్టీకి జీవం పోయలేక నానా తంటాలూ పడుతున్నారు.
జస్ట్, కొన్ని రోజుల వ్యవధిలోనే కేసీయార్ పార్టీ, వెంటిలేటర్ మీదకి ఎక్కేసిందనడం అతిశయోక్తి కాదు. నిజానికిది స్వయంకృతాపరాధం. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి, వైసీపీ సానుభూతిపరులు పూర్తిస్థాయిలో మద్దతిచ్చినమాట వాస్తవం. అయినా, గులాబీ పార్టీ ఓటమి చవిచూసింది.
ఇంత జరిగాక అయినా, కేసీయార్ కాస్త జాగ్రత్తగా వుండాలి కదా.? ఓ ఇంటర్వ్యూలో, ‘ఏపీలో జగన్ మళ్ళీ గెలుస్తారనే సమాచారం మాకుంది’ అని వ్యాఖ్యానించి, గులాబీ పార్టీకి మరణ శాసనం రాసేశారు.
‘మనకెందుకు బాపూ..’ అని కొందరు, ‘నీకెందుకు కాకా’ అని ఇంకొందరు, కేసీయార్కి క్లాసులు పీకుతున్నారు. అలా క్లాసులు పీకుతున్నోళ్ళంతా గులాబీ పార్టీకి హార్డ్ కోర్ అభిమానులు కావడం గమనార్హం.
తెలంగాణలో కేసీయార్ పార్టీ గల్లంతయ్యింది. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణ రాజకీయ తెరపైనుంచి కేసీయార్ పార్టీ తెరమరుగైపోతుందని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. ఆ పరిస్థితుల్నీ మనం చూస్తూనే వున్నాం. టిక్కెట్లు ఇచ్చిన తర్వాత అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు మరి.
‘మేం ఏపీ రాజకీయాల గురించి ఆలోచించట్లేదు’ అని ఊరుకోవాల్సింది పోయి, ‘జగన్ మళ్ళీ గెలుస్తా’డని కేసీయార్ ఎందుకు అన్నట్టు.? వాస్తవానికి, ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా, తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుస్థితినే ముందు ముందు ఎదుర్కొనాల్సి వచ్చేలా వుంది.