Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై ట్రోలింగ్ చేయడం వారి వికృత చేష్టలకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రాచీ నిగమ్ (Prachi Nigam) 10వ తరగతి పరిక్షల్లో టాపర్ గా నిలిచింది. దీంతో ఆమె ఫొటో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే.. ఆమెకున్న హార్మోన్ల ఇబ్బందితో తన మొఖంపై అవాంచిత రోమాలు ఉండటంతో హేళన చేయడం ప్రారంభించారు. తొలుత ‘కొన్ని మార్కులు తక్కువగా వచ్చినా బాగుండేద’ని బాధపడిన బాలికకు కొందరు నెటిజన్లు మద్దతుగా నిలవడంతో ఇప్పుడు హుందాగా స్పందించింది. ‘నా అందం కాదు.. మార్కులు చూడండి. చాణక్యుడి అందంపైనా వేధించారు కానీ.. ఏదీ ఆగలేద’ని వ్యాఖ్యానించింది.
ప్రాచీ తల్లి మమత స్పందిస్తూ.. ‘చికిత్స చేయించే క్రమంలో ఫలితాలు వచ్చాయి. నా కుమార్తె అగ్ర స్థానంలో నిలిచింది. వచ్చిన విమర్శలకు కుంగిపోవద్దని ధైర్యం చెప్పాను. ఇప్పుడు ప్రాచీ చికిత్సను ప్రభుత్వమే భరిస్తోంద’ని అన్నారు. ప్రియాంక గాాంధీ ప్రాచితో మాట్లాడి అనుకున్న లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్లాలని సూచించారు. సరైన సమాధానం చెప్పావంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.