కేవలం రూ.50 కోసం జరిగిన గొడవ.. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. పాల దుకాణం వద్ద జరిగిన చిన్న వివాదం పెద్దది కావడంతో అందులో పనిచేసే బాజీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పాల దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ రూ.50 ఇచ్చే విషయంలో బాజీతో కోటేశ్వరరావు వాదనకు దిగాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో కోటేశ్వరరావు తనతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువకులతో కలిసి బాజీపై దాడి చేశాడు. ఈ దాడిలో బాజీ అపస్మారక స్థితికి వెళ్లడంతో వెంటనే అతడిని సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాజీ ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడికి ఇద్దరు చిన్నారులున్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాల కేంద్రం వద్ద జరిగిన గొడవ తాలూకు దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
624814 827591Someone essentially assist to make severely posts I might state. That may be the extremely 1st time I frequented your site page and so far? I surprised with the analysis you made to create this specific submit incredible. Magnificent task! 998013
830725 146285Nicely picked details, several thanks to the author. It is incomprehensive in my experience at present, nevertheless in common, the convenience and importance is mind-boggling. Regards and all of the best .. 537563