వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే, అక్కడికి అదేదో నేరమన్నట్లుగా వైసీపీ అను‘కుల’ మీడియా ఏడుపు షురూ చేసింది.
‘గత మూడు సినిమాలకు ఓపెనింగ్స్ కూడా రాలేదు.. నీ ప్రచారంతో పిఠాపురంలో జనసేనకి ఏంటి ఉపయోగం.?’ అంటూ ఓ నీతి మాలిన వైసీపీ కూలి మీడియాలో వరుణ్ తేజ్కి వ్యతిరేకంగా కథనాలు పుట్టుకొచ్చాయ్.
పవన్ కళ్యాణ్ కంటే, వరుణ్ తేజ్ స్టార్డమ్ వున్న నటుడు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘బాబాయ్ కంటే నేనే గొప్ప..’ అని వరుణ్ తేజ్ ఏనాడూ చెప్పుకోలేదు. ‘బాబాయ్కి మా అవసరం రాదు. కానీ, బాబాయ్ కోసం ఆయన వెంట రాజకీయంగా మద్దతు పలుకుతాం.. ఆయనతోనే మా ప్రయాణం..’ అని వరుణ్ తేజ్ పలు సందర్భాల్లో చెప్పాడు.
రామ్ చరణ్ అయినా, ఇంకో మెగా హీరో అయినా.. పలు సందర్భాల్లో ఇదే మాట చెప్పారు, చెబుతూనే వున్నారు. ఎన్నికల ప్రచారంలో బాబాయ్కి తోడుగా వుండేందుకు వరుణ్ తేజ్, పిఠాపురంలో బాబాయ్ తరఫున ప్రచారం చేశాడు.
వరుణ్ తేజ్కి జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బాబాయ్ గెలుపు తథ్యమంటూ వరుణ్ తేజ్, పిఠాపురంలో నినదించాడు. వరుణ్ రాకతో, పార్టీ శ్రేణుల్లో మరింత కొత్త ఉత్సాహం కనిపించింది. సహజంగానే, ఇది వైసీపీకి మింగుడు పడలేదు.
బాబాయ్ – అబ్బాయ్ మధ్య అనుబంధం అంటే, బాబాయ్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టిన జగన్, అవినాష్ తరహాలో వుండాలని నీలి కూలి మీడియా ఆశించడంలో వింతేముంది.? కానీ, బాబాయ్ – అబ్బాయ్ అంటే పవన్ కళ్యాణ్ – వరుణ్ తేజ్లా వుండాలి.! అదే పద్ధతి.