Switch to English

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త విమలా రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు వైసీపీకి దూరం కాకుండా వుండేందుకు నానా తంటాలూ పడుతున్నారు.

గతంలో, వైసీపీ తరఫున క్రిస్టియన్ ఓటు బ్యాంకుని ‘పదిలం’ చేసి పెట్టింది ఎవరో కాదు, ‘బ్రదర్’ అనిల్ కుమార్.. ఆయనెవరో తెలుసు కదా, వైఎస్ షర్మిల భర్త. కానీ, ఇప్పుడు అనిల్ కుమార్ వ్యవహారం వేరేలా వుంది. కాంగ్రెస్ పార్టీ వైపు, ఏపీలోని క్రిస్టియన్ ఓటు బ్యాంకుని తెరవెనుకాల ఆయన మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

నో డౌట్, వైసీపీకి క్రిస్టియన్ ఓటు బ్యాంకు గతంలో బాగా ఉపయోగపడింది. ఈసారి కూడా క్రిస్టియన్ ఓటు బ్యాంకులో మెజార్టీ జగన్ వైపే వుంటుందన్నది ఓ వాదన. కానీ, వైఎస్ షర్మిల వ్యూమం చూస్తోంటే, వైసీపీకి ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంకు నుంచి పది శాతం అయినా పడుతుందా.? అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ఏ మతం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. గతంలో ఈ విషయమై కొందరు కోర్టుకెక్కారు కూడా. ఆ వ్యవహారంలో ‘నా మతం ఇదీ’ అని వైఎస్ జగన్ చెప్పలేదు, చెప్పేదాకా పరిస్థితి రాలేదు కూడా.!

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై గడచిన ఐదేళ్ళలో చాలా చాలా దాడులు జరిగాయి. రాములోరి విగ్రహానికి శిరచ్ఛేదం కూడా చేశారు దుండగులు. హిందూ దేవతా విగ్రహాలకు అశుద్ధం పూయడంతోపాటు, రధాల్ని తగలబెట్టడం కూడా చేశాయి కొన్ని అసాంఘీక శక్తులు.

అంతర్వేదిలో రధం తగలబడితే, తేనె పట్టు కోసం ఆకతాయిలు చేసిన పని.. అని కట్టు కథ అల్లింది వైసీపీ సర్కారు. కొత్త రథం చేయించామంటూ ఆ తర్వాత పబ్లిసిటీ స్టంట్లు చేశారనుకోండి వైసీపీ నాయకులు.. అది వేరే సంగతి.

ఇప్పుడు వైఎస్ షర్మిల, ‘మనది క్రిస్టియన్ మతం’ అని అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్న దరిమిలా, క్రిస్టియన్ పాలనలో హిందూ దేవాలపై దాడులు సహజమే కదా.? అన్న చర్చ రాష్ట్రంలోని హిందూ ఓటర్లలో ఒకింత గట్టిగానే జరుగుతోంది.

ఓ వైపు క్రిస్టియన్ ఓటు బ్యాంకు గండి పడి, ఇంకో వైపు హిందూ ఓటు బ్యాంకు నుంచి వైసీపీ పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత కనిపిస్తే.. వైసీపీ పరిస్థితేంటి.? ఈ భయం ఇప్పుడు వైసీపీలో బయల్దేరింది. షర్మిలని కంట్రోల్ చేయడం వైసీపీకి చేతకావడంలేదు. కారణం, వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కట్టుకున్న పసుపు చీర మీద దిగజారుడు వ్యాఖ్యలు చేయడమే.

అయితే, వైఎస్ షర్మిలని నమ్మడానికి వీల్లేదు.. ఆమె వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ, ఏది నిజం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...