కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లిలో ఉన్న పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న జయరాజు ప్లైవుడ్ కంపెనీలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. మృతి చెందిన వారు తండ్రీకొడుకులు.. కోటేశ్వరరావు, చిన్నారావుగా గుర్తించారు. అక్కడ ఉన్న కెమికల్స్ కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరూ తుక్కు కొనుగోలు చేసేందుకు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. మృతులిద్దరూ కండ్రిక గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఓ ఆటోలో కెమికల్ డబ్బాలు ఎక్కిస్తూండగా పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఇక్కడున్న కెమికల్స్ తో డోర్లు తయారుచేస్తారని తెలుస్తోంది. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సేఫ్టీ బృందాలు కూడా చేరుకున్నాయి. ఇది భారీ పేలుడే అని ప్రాధమికంగా గుర్తించారు. పేలుడుకు జరగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కంపెనీ నిర్వాహకుడు జీఎస్ఎన్ రెడ్డి స్పందించారు. ‘ఘటన జరిగిన సమయంలో తాము బయట లోడు దింపే పనుల్లో ఉన్నాం. అంతగా పేలుడు జరిగే పదార్ధాలు ఇక్కడ లేవు. ఎందుకు, ఎలా పేలుడు జరిగిందో తెలియటం లేదు. పేలుడు శబ్దం విని లోనికి వచ్చేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు’ అని అన్నారు.
900032 73175Generally I dont read write-up on blogs, but I would like to say that this write-up really compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, extremely wonderful post. 467050