అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రామమందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘సుందరమైన రామ మందిర నిర్మాణం భారతీయుల కల. మొత్తానికి ఆ కల నెరవేరబోతోంది. దీంతో ప్రశాంతత, ఐకమత్యానికి మార్గం సుగమమైంది. నేను, నా కుటుంబం వంతుగా ఈ చిన్న విరాళం అందిస్తున్నాను’ అన్నారు.
మరోవైపు ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీ బీజేపీ ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించనుంది. రూ. 10, 100, 1000 కూపన్ల రూపంలో.. వెయ్యికి పైగా డొనేషన్ ను చెక్కుల రూపంలో అందజేయవచ్చని పేర్కొంది. ఆరెస్సెస్, వీహెచ్పీ సహా ఇతర హిందుత్వ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. ఈమేరకు బీజేపీ జనరల్ సెక్రటరీ కుల్జీత్ చాహల్ తెలిపారు. రాజకీయ, సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాల ప్రముఖులు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు.
149687 174515Hey. Neat post. There is actually a difficulty with your internet site in firefox, and you may want to check this The browser will be the market chief and a large component of other folks will omit your outstanding writing because of this problem. 997131
933334 224278Approaches for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 126551