దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 22వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 13వేలకు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అక్కడ రోజురోజుకీ కరోనా కేసులు పెరుగడం కలకలం రేపుతోంది. అమరావతి, థానే వంటి ప్రాంతాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించగా.. ఇప్పుడు నాగ్ పూర్ లో కూడా లాక్ డౌన్ విధించారు. ఈనెల 15 నుంచి 21 వరకూ అక్కడ లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
అత్యవసర, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని.. అవసరమైనవారు మాత్రమే బయటికి రావాలని పోలీసులు సూచించారు. నాగపూర్లో ఒక్కరోజులోనే 1710 కేసులు నమోదయ్యాయి. 173 రోజుల తర్వాత నాగ్ పూర్ లో అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య ఇది. ప్రజలు కరోనాను సీరియస్ గా తీసుకోవడం మానేశారని అధికారులు అంటున్నారు. కేసులు పెరిగి, పరిస్థితి అదుపు తప్పితే ప్రస్తుతం విధించిన పాక్షిక లాక్డౌన్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అంటున్నారు.
837262 348262Hey. Extremely nice internet web site!! Man .. Superb .. Fantastic .. Ill bookmark this web website and take the feeds alsoI am happy to locate so a lot useful information here within the post. Thanks for sharing 596075
122076 70546i just didnt need to have a kindle at initial, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages over a book, and makes it such a lot additional convenient. i may undoubtedly advocate this item: 922455