విశాక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం, పోస్కోతో జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని పోరాట కమిటీ తెలిపింది. దీంతో ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కొత్త రూపం సంతరించుకుంది.
డిమాండ్లలో భాగంగా ఆర్-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పటికే సమ్మె విషయంలో ఉద్యోగులు మరింత పట్టుదలగా ఉన్నారు. విశాఖ ఉక్కును అమ్మేదెవరు..? కొనేదెవరు? అంటూ సమ్మె చేస్తున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఉద్యమానికి మరింత ఆజ్యం పోసిందని చెప్పాలి.