ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకడంలేదు.
ఉద్దానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి బలంగా గళం వినిపించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.ొ ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్నటినుంచే, ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది.
చంద్రబాబు హయాంలోనూ ఉద్దానం కిడ్నీ బాధితులకు పవన్ కళ్యాణ్ కారణంగానే కొంత ఊరట లభించింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో.. ఉద్దానం ప్రాంతంలో మంచినీటి సమస్యకు కొంత పరిష్కారం లభించిన మాట వాస్తవం.. అదీ, పాలన చివరి రోజుల్లో ఆ ప్రాజెక్టుని అందుబాటులోకి తెచ్చింది వైసీపీ.
ఎన్నికల సందర్బంగా ఉద్దానం ప్రజానీకం ఏమనుకుంది.? అన్న అంశంపై బోల్డన్ని సర్వేలు జరిగాయి. ఆయా సర్వేల సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితులు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా చాలా జాగ్రత్తపడింది.
పోలింగ్ తర్వాత ఇదే ఉద్దానం ప్రాంతంలో ప్రజలేమనుకుంటున్నారు.? ఎన్నికల్లో ఎటు వైపు మొగ్గు చూపారు.? అన్నదానిపై ఆరా తీస్తే, పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి వైపు మొగ్గు చూపినట్లు ఈ ప్రాంతంలో పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
రాజకీయాల్ని పక్కన పెడితే, ఉద్దానం ప్రాంతం పట్ల చిత్తశుద్ధితో ప్రేమ ప్రదర్శించింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెబుతున్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు. తమ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్ళింది ఆయనేనని అంటున్నారు వారంతా.
ఔను, ఉద్దానం ప్రాంతం పవన్ కళ్యాణ్ని అస్సలు మర్చిపోలేదు.