Viral Video: దొంగలు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేయడం చూస్తూనే ఉంటాం. కదిలే రైళ్ల నుంచి గొలుసులు, బ్యాగులు, మాట్లాడేవారి నుంచి ఫోన్లు, కార్ల అద్దాలు పగులగొట్టి వస్తువులు.. ఇలా రకరకాల దొంగతనాలు జరుగుతూంటాయి. అయితే.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ముగ్గురు దొంగలు చేసిన దొంగతనం వీటన్నింటికీ బాప్ లా ఉందంటే అతిశయోక్తి కాదు. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వారు చేసిన దొంగతనాన్ని ఓ వక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఆగ్రా-ముంబై నేషనల్ హైవేపై షాజాపూర్లో జరిగినట్టు తెలుస్తున్న వీడియోలో.. ఓ ట్రక్కు భారీ లోడుతో వేగంగా వెళ్తోంది. దీనిపైకి అప్పటికే ఎక్కిన ఇద్దరు దొంగలు ఓ మూటను ట్రక్కు పైనుంచి పడేశారు. ట్రక్కు వెనకాలే బైక్ పై వస్తున్న మరో దొంగ దాని దగ్గర వరకూ వెళ్లాడు. ప్రమాదకర రీతిలో ఇద్దరు దొంగలు ట్రక్కుపై నుంచి బైక్ పైకి ఒకొక్కరిగా ఎంతో చాకచక్యంగా దిగారు. దొంగతనాల్లో ఇది వేరంటూ.. ధూమ్ సినిమా ఎందుకు పనికొస్తుందంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
मुंबई नेशनल हाईवे पर मध्यप्रदेश में शाजापुर जिले की है
बाइक सवार 3 चोर चलते ट्रक से सामान चुरा रहे हैं
हालांकि इस घटना में ऐसा भी लगता है, जैसे ट्रक ड्राइवर की मिलीभगत हो।
चोरी होने तक ट्रक साइड चलता रहा
चोरी पूरी होते ही ट्रक की साइड बदल गई… #indiasuperfast pic.twitter.com/LrhDrUTZCM
— INDIA SUPERFAST (@IndiaSuper94108) May 25, 2024