గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,14,393కి చేరింది. మరణాల సంఖ్య 11,999కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 17,22,381 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 10,114 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 87,756 కరోనా టెస్టుల నిర్వహించారు.
మొత్తంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,05,38,738 కరోనా టెస్టులు నిర్వహించారు. 24 గంటల్లో నమోదైన మరణాల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12, ప్రకాశం జిల్లాలో 8, ప.గో జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5గురు, అనంతపురం, తూ.గో, శ్రీకాకుళం జిల్లాల్లో 4, గుంటురు, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 3, కడప, నెల్లూరు జిల్లాల్లో 2 చొప్పున మృతి చెందారు.