సోషల్ మీడియాలో వివిధ పార్టీల కార్యకర్తలు చేసే కామెంట్లు.. వాళ్ళు చెప్పే జోస్యాల్ని పట్టించుకోవాల్సిన అవసరం వుందా.? లేదా.? ఏమోగానీ, ఓ అంశం చుట్టూ మెజార్టీ అభిప్రాయాలు ఒకేలా వున్నప్పుడు.. ఆ అభిప్రాయాలు జోస్యాలై.. అవి నిజమైనప్పుడు, ఖచ్చితంగా రాజకీయాల్లో చర్చనీయాంశాలవుతాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో వైసీపీ శ్రేణులు ముందే ఈ పరిస్థితిని అంచనా వేశాయి. ‘లోపలేసి కుమ్మేస్తాం..’ అంటూ గత కొంతకాలంగా రఘురామను వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తూనే వున్నాయి. ‘కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా వాటిని అమలు చేయాల్సింది తమ ప్రభుత్వం, తమ పోలీసులు గనుక అంతా మేం చెప్పినట్లే జరుగుతుంది..’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పోస్టింగ్ పెద్దయెత్తున పెడుతున్నారు.
ఇవన్నీ రఘురామ మీద వున్న అసహనంతో పెట్టే వైరల్ పోస్టింగ్స్ మాత్రమేనా.? అంతకు మించి, వీరి జోస్యాలు నిజమవడానికి.. పార్టీకి చెందిన ముఖ్య నేతలు అందిస్తున్న లీకుల వ్యవహారమా.? అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ ప్రజల్లో జరుగుతోంది. రఘురామకు న్యాయస్థానం నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకు ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలనీ సూచించింది. ప్రభుత్వాసుపత్రితోపాటు, ప్రైవేటు ఆసుపత్రి కూడా వైద్య పరీక్షలు చేయాల్సి వుంటుంది న్యాయస్థానం ఆదేశాల మేరకు.
అయితే, వైద్య పరీక్షల అనంతరం, రఘురామను ఈ రోజు గుంటూరు జైలుకి తరలించారు పోలీసులు. దీన్ని కూడా వైసీపీ అభిమానులు ముందే ఊహించారు. ‘మే 18న ఏం జరగబోతోందో అంతా చూస్తారు..’ అంటూ కొన్ని దారుణమైన పోస్టింగ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి రఘురామకు సంబంధించి. ఈ తరహా పోస్టింగ్స్, ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చేవిగా వున్నాయన్న వాదన కూడా లేకపోలేదు. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. వైసీపీ ప్రత్యర్థులకు ట్రీట్మెంట్ ఇలాగే వుంటుందని వైసీపీ అభిమానులు చెబుతున్న దరిమిలా.. ప్రత్యర్థుల్ని వైసీపీ తమ తాజా చర్యలతో భయపెడున్నట్లే కనిపిస్తోంది.
769130 73904Hey! I basically wish to give an enormous thumbs up for the excellent details youve got here on this post. I will likely be coming back to your weblog for far more soon. 911866