పారాసిటమాల్ సరిపోతుంది.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు.. అంటూ ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ప్రకటనలు ఇచ్చేశారు. నిజమే, కొందరికి కేవలం పారాసిటమాల్ ట్యాబ్లెట్లతోనే కరోనా తగ్గిపోతోంది. దాంతోపాటు, కొన్ని సాధారణ మందులు వాడితే, కరోనా నుంచి చాలామంది ఉపశమనం పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే మాత్రం సీన్ మారిపోతుంది.. ప్రాణాపాయ స్థితికి కరోనా బాధితులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యకమైన మందులు వాడాలి. లక్షణాల్ని బట్టి వైద్యం.. అని వైద్యులు చెబుతున్నారు.
కానీ, లక్షణాలతో సంబంధం లేకుండానే కొన్ని ప్రత్యేకమైన మందులు యధేచ్ఛగా వాడేస్తున్నారు. వీటిల్లో రెమిడిసివిర్ అతి ముఖ్యమైనది. గరిష్టంగా మూడు వేల రూపాయలు పలికే రెమిడిసివిర్ ఇంజక్షన్ 35 నుంచి 60 వేల దాకా పలుకుతోందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇది పనిచేస్తోందా.? లేదా.? అన్నదానిపైనే ఇంకా చాలా అనుమానాలున్నాయి.
మరోపక్క, ప్లాస్మా థెరపీ గురించి కూడా చాలా రచ్చ జరుగుతోంది. ఆ ప్లాస్మా థెరపీ వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నది అంతర్జాతీయంగా పలు అధ్యయనాలు చెబుతున్న సారాంశం. అయినాగానీ, ప్లాస్మా దానం చేయండహో.. అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తూనే వున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్ (కోవిడ్ 19) పరిచయమై ఏడాదిన్నర దాటేసింది.. ఇప్పటికీ ఖచ్చితమైన మెడిసిన్, ఈ వైరస్ బారిన పడ్డవారిని నయం చేసేందుకు కనుగొనబడలేదు. కానీ, అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్లు వచ్చేశాయి. అవెంతవరకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.? అన్నదానిపైనా ఇంకా ఇంకా ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి.
వున్నంతలో ప్రభుత్వాలు.. ప్రజలకు కరోనా వైరస్ గురించిన అనుమానాలు, అపోహలపై స్పష్టతినిచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. పూర్తిగా ఇప్పటికీ ఈ వైరస్ గురించిన అనుమానాలకు నివృత్తి లభించడంలేదు.
992527 745240I believe this web site has some rattling wonderful information for everyone : D. 638141
292852 917197This site is my aspiration , very fantastic pattern and perfect articles . 439263
870208 857417An interesting discussion is price comment. I feel which you should write extra on this topic, it may possibly not be a taboo topic but normally individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 761892