ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా ఇప్పుడు ఓ గులక రాయి.! క్షమించాలి.. కంకర రాయి కూడా కావొచ్చు.!
కొత్తగా ‘ఎయిర్ గన్’ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు ది గ్రేట్ సజ్జల రామకృష్ణా రెడ్డి.! ఎలా.? క్యాట్ బాల్ ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి గాయపర్చారంటూ తొలుత ఓ వాదన తెరపైకొచ్చింది. అంతకు ముందు గురి చూసి ఎవరో రాయి విసిరారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడేమో కొత్తగా ఎయిర్ గన్ అట.!
వాట్ ఏ పిటీ.! నిజానికి, ఇప్పుడు మీడియా నిలదీయాల్సిది, పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని.! ఆయనేమీ సాదా సీదా వ్యక్తి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుంటాయి. ఎన్నంచెల భద్రత వుంటుందో మీడియాకి బాగా తెలుసు. మరి, మీడియా ఏ కోణంలో విశ్లేషించాలి.?
విద్యుత్ సరఫరా ఆ ప్రాంతంలో ఎందుకు నిలిచిపోయింది.? అాలా నిలిచిపోవడం వెనుక విద్యుత్ శాఖ వైఫల్యమే కారణమా.? లేదంటే, ఇదీ ముందస్తు ప్రణాళికేనా.? ముఖ్యమంత్రి పర్యటన అంటే, బోల్డంత ప్రోటోకాల్ వుంటుంది కదా.. ఆ ప్రోటోకాల్ ప్రకారం, విద్యుత్ అంతరాయం అస్సలు రాకూడదు.!
ఎయిర్ గన్ లాంటి ఆయుధాలు ముఖ్యమంత్రి ప్రయాణించే ప్రాంతంలో వాడటానికి అసలు అవకాశం వుంటుందా.? బోల్డంత తనిఖీ, నిఘా వ్యవస్థ వుంటుందాయె. రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే, పూర్తిగా ఇది భద్రతా వైఫల్యమే. దీనికి పూర్తి బాధ్యత, రాష్ట్ర పోలీసు విభాగమే తీసుకోవాలి.
రాజకీయ పార్టీలు ఈ విషయమై నిలదీస్తున్నా, ఓ వర్గం మీడియా మాత్రం, విపక్షాల మీద నేరం నెట్టేసి, తీర్పులు పాస్ చేసేస్తున్నాయి. ఇంతలా నీలి కూలి మీడియా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.? ఇలాంటి ఘటన జరుగుతుందని, అధికార పార్టీకి ఆ నీలి కూలి మీడియా నుంచి లీకులు అందాయా.? లేదంటే, ఘటన జరిగాక, ఈ స్థాయిలో రచ్చ చేయడానికి పేమెంట్లు పెంచారా.?
ఎక్కడా నెగెటివ్ వార్తే రాకూడదన్న కోణంలో, నీలి కూలి మీడియాలో ఈ ఘటనపై వైసీపీ కోణంలోనే కథనాలు ఎక్కువగా వండి వడ్డిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. న్యూట్రల్ మీడియాని కూడా వైసీపీ ఏమార్చే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. వైసీపీ వ్యతిరేక మీడియాలో ఎలాగూ, ఇదంతా భూటకం.. అనే కథనాలు వస్తాయనుకోండి.. అది వేరే సంగతి.
ఏదిఏమైనా, వైసీపీ నేతలకంటే, నీలి కూలి మీడియా శోకాలు పెడుతున్న తీరు చూస్తోంటే, ఇదంతా పెద్ద కట్టు కథ.. పెయిడ్ వ్యవహారం.. అని సాధారణ ప్రజానీకం అనుకోకుండా వుండగలరా.?