Bihar: రైళ్లలో దొంగతనానికి పాల్పడే దొంగలకు బుద్ది వచ్చేలా చేశారు ప్రయాణికులు. రైలు వేగాన్ని, కిటీకీ పక్కన కూర్చుని ప్రయాణం చేసే వారిని.. ఆదమరిచి ఉండేవారిని చూసి దొంగలు ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలా దొంగతనం చేయబోయిన ఓ వ్యక్తిని ఏకంగా వెళ్తున్న రైలుకే వేలాడదీశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
బీహార్.. (Bihar) భాగల్ పూర్ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలులో ప్రయాణికురాలు ఫోన్ మాట్లాడుతూండగా ఆమె నుంచి ఫోన్ కొట్టేయబోయాడో దొంగ. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు అతడి రెండు చేతులు పట్టుకుని కదులుతున్న రైలుకే వేలాడదీసి కొన్ని మీటర్లు తీసుకెళ్లిపోయారు.
రైలు ట్రాక్ మారుతూండగా కిందన కొందరు అతడిని పట్టుకుని దించారు. ఈ దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇటివలే బీహార్ లోని బెగుసరాయ్ లో కూడా ఇదే తరహాలో ఓ దొంగను కదులుతున్న రైలుకు వేలాడదీసి ఏకంగా 15కి.మీ తీసుకెళ్లారు.
Kalesh near Bhagalpur Bihar, a snatcher was snatching a passenger’s phone from a moving train, but he could not succeed in it and the passenger caught the snatcher and carried him hanging for about a kilometer
pic.twitter.com/66wIJmzWjS— Ghar Ke Kalesh (@gharkekalesh) January 17, 2024