సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే క్రమంలో నిర్వహించిన ర్యాలీ.. జన సునామీని తలపించింది.
రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వందలాది కాదు, వేలాది కాదు.. లక్షలాది మంది జనసేనాని వెంట కదిలి వెళ్ళారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, జనసేనాని వెంట యువకులతోపాటు వృద్ధులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో ర్యాలీగా వెళ్ళడం.
అడుగడుగునా మహిళలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి హారతులిచ్చారు. వృద్ధులు, వికలాంగులు, ‘పిఠాపురం ఎమ్మెల్యే వస్తున్నాడదిగో..’ అంటూ అప్పుడే, పవన్ కళ్యాణ్ని పిఠాపురం ఎమ్మెల్యేగా అభివర్ణించేయడం మరో ఆసక్తికరమైన అంశం.
హైద్రాబాద్ సహా, పలు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్దయెత్తున జనం, పిఠాపురం ముందే చేరుకున్నారు.. పవన్ కళ్యాణ్ వెంట నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు. దారి పొడుగునా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జనసేన శ్రేణులు మంచి నీళ్ళతోపాటు, ఆహారం కూడా అందించడం విశేషం.
నిజానికి, పది రూపాయలు కూడా పార్టీ ఖర్చు చేయకపోయినా స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు సొంత ఖర్చుతోనే జనసేన కార్యక్రమాలకు హాజరవడం కొత్తేమీ కాదు. అయినాసరే, ఈ జన సంద్రం ఇంకా ప్రత్యేకం. చాలా పద్ధతిగా, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకూ తావు లేకుండా, చాలా క్రమశిక్షణతో నామినేషన్ కార్యక్రమం జరిగేలా చేశారు అభిమానులు, కార్యకర్తలు.
ఓ వైపు, 150 నుంచి 500 వరకు ఒక్కో మనిషికీ వెచ్చించి మరీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత నామినేషన్ కార్యక్రమం నిర్వహించగా, ఆ కార్యక్రమానికి చాలా చాలా పలచగా జనం హాజరయ్యారు. పలువరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఆమె కోసం పిఠాపురంలో పని చేస్తోంటే, ఆమెకు ఎదురయిన చేదు అనుభవం ఇది.
కానీ, పవన్ కళ్యాణ్ నామినేషన్.. జన సంద్రం నడుమ.. నభూతో నభవిష్యతి.. అనేలా సాగింది.