Bala Krishna: నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన సంఘటన చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ కు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు తనయుడు బాలకృష్ణ (Bala Krishna) అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే అక్కడ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
వీటిని చూసిన బాలకృష్ణ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ‘తీసేయండి.. ఇప్పుడే’ అంటూ ఫ్లెక్సీలను చూపుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. బాలకృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అనంతరం వచ్చిన బాలకృష్ణ వాటిని తీసేయాలని కాస్తంత గంభీరంగానే చెప్పారు. ఆయన సంజ్ఞలు, మాటలు వీడియోలో రికార్డయ్యాయి. దీంతో అక్కడే ఉన్నవారు కొందరు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి ఘాట్ బయట పెట్టారు. బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.