Pawan Kalyan: సామాజిక అంశాలు, ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందించే జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను ఓ అభిమాని భావోద్వేగానికి గురి చేశాడు. ఐర్లాండ్ లో ‘ఓడ కళాసీ’గా పని చేస్తున్న ఓ అభిమాని తన సమస్యలు, వ్యవస్థ, పవన్ కల్యాణ్ పోరాటపటిమ గురించి లేఖ రాసి ప్రస్తావించడం పవన్ ను కదిలించింది.
దీనికి స్పందించిన పవన్ కల్యాణ్.. ‘నా ప్రియమైన జనసైనికుడికి… నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు..’ అని ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. జనసైనికులు సైతం తామంతా పవన్ బాటలోనే అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.
‘అన్నా.. కష్టాలు, కన్నీళ్లు,రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లేందరికో ఒక్కటే నీ మీద ఆశ..! ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా..? సరికొత్త గెరిల్లా వార్ ఫెయిర్ను మొదలెట్టక పోతావా..? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతామా..? 17 ఏళ్లుగా ఈ ( భారత్) దేశంలో లేకపోయినా.. దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వారందరూ.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం..
2014 – నిలబడ్డాం
2019 – బలపడ్డాం
2024 – బలంగా కలబడదాం!.. అని రాసుకొచ్చాడు అభిమాని తన లేఖలో.
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే,
గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏 pic.twitter.com/XhbSYQ1Y6D— Pawan Kalyan (@PawanKalyan) January 17, 2024