నిన్న రోహిత్ శర్మ మోచేతికి, త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బలంగా తాకడంతో విలవిలలాడిన విషయం తెల్సిందే. వెంటనే ప్రాక్టీస్ నుండి వెళ్ళిపోయిన రోహిత్, నొప్పితో బాధపడుతూ కనిపించాడు. అయితే ఓ గంట తర్వాత తిరిగి బ్యాటింగ్ కు వచ్చి ఇబ్బంది పడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఈరోజు విరాట్ కోహ్లీకి గాయమైందంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడటం చాలా ముఖ్యం.
టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో భాగంగా హర్షల్ పటేల్ వేసిన బంతి విరాట్ కు గజ్జల్లో బలంగా తాకింది. దీంతో విరాట్ నొప్పితో ప్రాక్టీస్ కు దూరమయ్యాడు. విరాట్ కు గాయం విషయంలో అందరూ కలవరపడ్డారు. కానీ తాజాగా తెలుస్తోన్న విషయం ఏమిటంటే విరాట్ కు అయిన గాయం పెద్దది కాదు. విరాట్ కాసేపటికి నవ్వుతూ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్స్ ఇస్తూ కనిపించాడు. కాబట్టి పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు.
333600 53271I genuinely enjoy reading on this site, it holds amazing articles . 823700
948852 442831Wonderful activity! 680936