రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ఆరాటపడుతోంది. ప్రజల్లో మార్పు వస్తే తప్ప, రాజకీయ వ్యవస్థలో మార్పు రాదని జనసేన పార్టీ బలంగా నమ్ముతోంది. ‘ప్రజలకు అండగా వుంటాం.. కానీ, తమ సమస్యలపై నినదించాల్సింది ప్రజలే.. ఆ ప్రజలకు జనసేన పార్టీ అండగా వుంటుంది..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు.
ఎన్నికల్లో గెలుపోటముల సంగతి తర్వాత.. అసలంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా బతికి వుండకూడదనే భావజాలాన్ని ఏమనాలి.? ఇదే జనసేనాని ప్రశ్న. ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీ, ప్రత్యర్థుల్ని మట్టుబెట్టేందుకు ఏ స్థాయికైనా దిగజారుతోందని.. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పలు ఘటనలు నిరూపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల వేళ, ఎంతమంది రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ బెదిరింపులకు పాల్పడింది.. ప్రశ్నించినవాళ్ళని ఎంతమందిని మట్టుబెట్టింది.? ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. బ్రిటన్ దేశానికి ఓ భారత సంతతి వ్యక్తి ప్రధాని అవగలిగినప్పుడు.. ఇక్కడ అణగారిన వర్గాలకి చెందినవారు స్వేచ్ఛగా నామినేషన్ వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని జనసేనాని ప్రశ్నించారు.
‘‘మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. బ్రిటన్ దేశానికి ఒక భారతీయ సంతతికి చెందిన రిషి సనాక్ ప్రధానమంత్రి అవగలిగే పరిస్థితులు వున్నప్పుడు.. ఇక్కడ ఎందుకు ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం వున్న వ్యక్తులు మిగతావాళ్ళని ఎందుకు రానివ్వరు.? ఎంతకాలం రానివ్వకుండా వుంటారు.?’’
‘‘భారత దేశం స్వాతంత్ర్యం సంపాదించగానే మనం చేసిన అద్భుతమేంటంటే.. పంచాయితీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గాలకి చెందిన ఒకడు కూర్చుని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం.. ఓట్లు వచ్చినా.. ఆ పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి.? బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా.. ఇంకా ఎవరికి ఊడిగం చేస్తున్నాం.? నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదు భయపెట్టేస్తాం అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలుగొట్టక తప్పదు. ఏ రోజు.? అని ఎదురు చూస్తున్నాం.’’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిమాటా అత్యంత విలువైనదీ, ఆలోచింపజేసేదీ.! ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలవ్వాల్సిందే. కానీ, ఎలా.. కుదిరితే ఓట్లు కొనేస్తాం.. కుదరకపోతే, ప్రత్యర్థి అనేవాడు ఎన్నికల్లో లేకుండా చేసేస్తాం.. అనే స్థాయికి పాలకులు దిగజారిపోయాక.. వ్యవస్థలో ఎలా మార్పు వస్తుంది.?
జనసేన పార్టీకి చెందిన బలికిరి ప్రణయ్ కుమార్ అనే యువకుడు, కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశాడు. కానీ, రాక్షస రాజ్యం ఆయన్ని బలితీసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా చలించిన జనసేనాని, బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022
603445 327182Yay google is my king aided me to uncover this outstanding web site! . 806127
96158 154934Attractive part of content material. I just stumbled upon your internet site and in accession capital to claim that I acquire in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly quickly. 113476
10548 142558I real delighted to discover this web site on bing, just what I was looking for : D also bookmarked . 763977
459563 684786Pretty section of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get actually enjoyed account your blog posts. Any way I will likely be subscribing to your augment and even I achievement you access consistently quickly. 446920