రెండు దశాబ్దాల క్రితమే మెగా అభిమానులను సేవా మార్గం వైపు నడిపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాల ద్వారా.. తన వ్యక్తిత్వంతో అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. పవన్ బాటను అనుసరించిన లక్షలాది మంది అభిమానుల్లో కుందన్ సాయి ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మహేష్ స్వర్ణపురి ఒకరు.
జనసేన పార్టీ తరపున ఆయన చేస్తున్న సేవలు వర్ణనాతీతం. పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో.. డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పేరుతో ప్రతి శనివారం ఎంతోమంది పేదలకు అన్నదానం చేస్తూండటం విశేషం. పేద విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో మహేష్ ఎంతో సేవ చేస్తున్నారు…ఇటీవల తెలంగాణ పోలిస్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగాల కోసం 150 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించగా, వారిలో సుమారు 60 మంది క్వాలిఫై అయినట్లు మహేష్ తెలిపారు.
తనకున్న సామాజిక స్పృహతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీ తరపున మన్ననలు పొందారు మహేష్’. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అత్యధిక మందితో రక్తదానం చేయించి ఎందరో ప్రాణాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించడం ఎంతో అభినందనీయం.