ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తారట.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించారు.. ఆ బస్సు యాత్రలో వైసీపీ క్యాడర్ పెద్దయెత్తున పాల్గొంది.. వందలాది మంది పోలీసులు, ఆ బస్సు యాత్రకు భద్రత కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ వుంటుంది.
అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ‘రాయి దాడి’ జరిగింది. దాన్ని గులకరాయిగా కొందరు చెబుతున్నారు. ఇంకొందరేమో కంకర రాయి అంటున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎయిర్ గన్ ఉపయోగించి దాడి చేశారంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందని వైసీపీ అను‘కుల’ మీడియా ఆరోపిస్తోంది. ఇంత పెద్ద ఘటన జరిగితే, పోలీసులు ‘సరైన సమాచారం ఇస్తే రెండు లక్షల బహుమతి’ అని ప్రకటించడాన్ని ఎలా చూడాలి.?
మామూలుగా అయితే, తమ కుటుంబ సభ్యులెవరైనా తప్పిపోతే, సమాచారం ఇచ్చినవారికి లక్ష రూపాయలో రెండు లక్షలో బహుమతి ప్రకటించడం.. ఈ తరహా ప్రకటనల్ని తరచూ చూస్తుంటాం.
ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే, సమాచారం ఇచ్చినవారికి రెండు లక్షల బహుమతిస్తామనడం కూడా అలాంటిదేనా.? సామాన్యులకంటే వేరే దారి వుండదు.. బహుమతులు ప్రకటిస్తారు. కానీ, పోలీస్ శాఖ అలా కాదు కదా.!
ఇంటెలిజెన్స్ విభాగం వుంటుంది, సీఐడీ వంటి విభాగాలుంటాయ్.. ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో ట్వీటేస్తే, రాత్రికి రాత్రి ఇళ్ళల్లోకి చొరబడి, అరెస్టులు చేసేస్తుంటారు కదా.? ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే, ఎవరో సామాన్యులు ఇచ్చే సమాచారం మీద ఆధారపడి నిందితుల్ని పట్టుకుంటారా.? అదసలు పద్ధతేనా.?
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని తీరు ఎలా వుంది.? అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వుండాల్సింది. డ్రోన్ కెమెరాలు, వైసీపీ పార్టీ తరఫున వీడియో షూట్ చేసే వ్యక్తుల దగ్గర వుండే వీడియో ఫుటేజ్.. న్యూస్ ఛానళ్ళకు సంబంధించిన వీడియో ఫుటేజ్.. వైసీపీ క్యాడర్ దగ్గర వుండే వీడియోలు.. ఇవి కూడా క్యాప్చర్ చేయలేకపోయాయా ఆ ఘటనని.? నమ్మేలా వుందా ఇది అసలు.?
అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు అర్థమవడంలేదు. ఇంత దయనీయ స్థితిలో వున్న పోలీసు శాఖని చూసి ప్రజలు ఆందోళన చెందాలో, ఆవేదన చెందాలో అర్థం కాని పరిస్థితి మరి.! ప్రజల రక్షణ రాష్ట్రంలో ‘గాల్లో దీపం’లా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంది?