కరోనా పేషంట్స్ చికిత్సకు ఎప్పుడైతే ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు వచ్చాయో అప్పటి నుండి వారి పంట పండినట్లయ్యింది. లక్షల రూపాయల బిల్లులు వసూళ్లు చేస్తున్నారు. ప్రాణాల మీద ఉన్న ఆశతో కరోనా అని తెలిసిన వెంటనే డబ్బున్న వారు ప్రైవేట్ హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. కొందరు డబ్బు లేని వారు కూడా కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలి వెళ్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ హాస్పిటల్స్ వారు లక్షల రూపాయల బిల్లు వేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక లేడీ డాక్టర్ పెట్టిన వీడియో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా పాజిటివ్ అంటూ తేలడంతో డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ప్రతి రోజు లక్ష రూపాయల ఫీజ్ను చెల్లించాలంటున్నారట. అయితే అంత డబ్బు లేదని చెల్లించక పోవడంతో ట్రీట్మెంట్ ఇవ్వక పోవడంతో పాటు కనీసం డిశ్చార్జ్ కూడా చేయడం లేదంటూ ఆ లేడీ డాక్టర్ కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించి వేసింది. ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనపై స్పందించాలంటూ నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
#Hyderabad లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో #coronavirus కారణంగా జాయిన్ అయితే రోజుకో లక్ష రూపాయలు బిల్ వేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓడాక్టర్
ప్రస్తుతం బిల్ కట్టలేదని , అసలు వైద్యమే అందించకపోవడమే కాకుండా కనీసం డిశ్చార్జ్ కూడా చెయ్యట్లేదు#TelanganaCovidFailure #Telangana pic.twitter.com/TSqnSbyo17
— TeluguBulletin.com (@TeluguBulletin) July 5, 2020
493763 298906I discovered your blog internet site on google and check just a few of your early posts. Proceed to maintain up the excellent operate. I just extra up your RSS feed to my MSN Data Reader. Seeking forward to reading much more from you in a even though! 741368