‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.!
ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.? పోరంబోకులం అయితే కాదు కదా.? ఓహో, రాజకీయం అంటేనే పోరంబోకుతనం అయిపోయింది కదా.! అక్కడొస్తోంది అసలు సమస్య.! ‘ఫలానా సుబ్బారావుగారి పెళ్ళాం’ అని ఎక్కడన్నా.. ఎవరన్నా అంటారా.? ఛాన్సే లేదు.
‘సుబ్బారావుగారి భార్య..’ అంటాం. ఇంకా గౌరవంగా అంటే, ‘సుబ్బారావుగారి సతీమణి’ అంటాం. ‘సుబ్బారావుగారి ధర్మపత్ని’ అని కూడా అంటుంటాం. ‘సుబ్బిగాడి పెళ్ళాం’ అని అంటే, అది హేళన.!
భార్య అంటే గౌరవం, పెళ్ళాం అంటే హేళన.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ‘పెళ్ళాం’ అనే ప్రస్తావన తెస్తున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ.! పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిథిగా జనం సొమ్ము తినేసి వుంటే, ఆయన్ని రాజకీయంగా విమర్శించొచ్చు. అసలంటూ పవన్ కళ్యాణ్ని విమర్శించేందుకు వైఎస్ జగన్ దగ్గర కంటెంటే లేదు. అదే అసలు సమస్య.
అందుకే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తెస్తూ, పదే పదే ‘పెళ్ళాలు.. కార్లు..’ అంటూ మహిళల ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కించపర్చుతున్నారు. ‘పవన్ కళ్యాణ్ పోరంబోకు..’ అని వైఎస్ జగన్ విమర్శించి వుంటే అది వేరే లెక్క. కానీ, ‘పవన్ కళ్యాణ్ పెళ్ళాలు’ ఏం తప్పు చేశారు.?
‘జీవితంలో అన్నీ అనుకున్నవి జరగవు. నా నుంచి విడాకులు తీసుకున్న ఆడబిడ్డల్ని అవమానిస్తావా.? పెళ్ళాలంటూ వాళ్ళని కార్లతో పోల్చుతావా.? నీ భార్య భారతిగారిని పెళ్ళాం అంటే బావుంటుందా..’ అని నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
అంతే, తెల్లారేసరికి పోసాని కృష్ణమురళి మీడియా ముందుకొచ్చేశాడు. ఆయనకేదో పదవి కట్టబెట్టింది వైసీపీ సర్కారు గతంలోనే. ఆ పదవిలో ఆయన పీకిందేంటో ఎవరికీ తెలీదు. పోసాని మీడియా ముందుకొస్తే ఎలా వుంటుందో తెలుసు కదా.?
‘ముఖ్యమంత్రి భార్యని పట్టుకుని పెళ్ళాం అంటావా.? ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటావు..’ అంటూ పోసాని విరుచుకుపడిపోయాడు. అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒళ్ళు కొవ్వెక్కి ‘పెళ్ళాం’ అని అన్నారని పోసాని సర్టిఫికెట్ ఇచ్చినట్లే అర్థం చేసుకోవాలి. ‘చిరంజీవి పెళ్ళాం.. చంద్రబాబు పెళ్ళాం.. పోసాని పెళ్ళాం..’ అని పిలుస్తారట. అలాగని పోసాని అంటున్నాడు. బుర్ర చెడితేనే ఇలాంటి మాటలొస్తాయ్ ఎవరికైనా.!
పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణమురళి ప్యాకేజీ ఆరోపణలూ చేసేశాడు. ఇదే పోసాని, గతంలో ‘పవన్ కళ్యాణ్ని కొనేంత దమ్ము ఎవడికీ లేదు’ అని చెప్పడం చూశాం. పోసాని అంటేనే మెంటల్ కృష్ణ. ఇప్పుడు పూర్తిగా మతి చెడింది.! లేకపోతే, ఈ ప్రేలాపనలేంటి.?
‘పెళ్ళాం’ అన్న దిక్కుమాలిన ప్రస్తావన మీద ప్రెస్ మీట్ పెట్టి, దాన్ని అధికారిక పదంగా పోసాని మార్చేశాడంటే, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? ఇకపై ఎవరైనా జగన్ పెళ్ళాం భారతి, చంద్రబాబు పెళ్ళాం భువనేశ్వరి..’ ఇలా పిలుచుకోవాలన్నమాట. సిగ్గుండక్కర్లేదా.?