శనివారం రాత్రి సమయంలో అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి ముగ్గురు వెళ్లి తమకు కరోనా ఉందని తమకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. వారిని వెంటనే చేర్చుకున్న ఆసుపత్రి వర్గాల వారు అధికారులకు విషయం తెలియజేశారు. వారు ఎక్కడ నుండి వచ్చారు, ఎవరి నుండి వైరస్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకున్న క్రమంలో షాకింగ్ విషయం బయట పడినది. వారు హైదరాబాద్ నుండి వైరస్ పాజిటివ్తోనే అదిలాబాద్ వచ్చారు.
హైదరాబాద్లో కరోనా టెస్టులు నిర్వహించుకున్న ఆ ముగ్గురు పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో అదిలాబాద్ ఆర్టీసీ బస్సులో వచ్చామని చెప్పారు. సికింద్రబాద్ జేబీఎస్లో సూపర్ లగ్జరీ బస్సు ఎక్కిన వారు తమకు కరోనా ఉందనే విషయాన్ని బస్సులో చెప్పకుండా ప్రయాణం చేశారు. లక్షణాలు పెద్దగా లేకపోవడంతో బస్సు డ్రైవర్కు అనుమానం రాలేదు. బస్సులో వీళ్లు ప్రయాణించడంతో అధికారులు ఆ బస్సులో ప్రయాణించిన వారందరిని కూడా టెస్టు చేయాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్తో ఎలా బస్సులో ప్రయాణిస్తారంటూ ఆ ముగ్గురిపై అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
856086 735449I like the valuable information you supply within your articles. Ill bookmark your blog and check once again here regularly. Im quite certain Ill learn several new stuff proper here! Very good luck for the next! 614339