Switch to English

ఏపీలో కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ.. ఈసారేమవుతుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కొత్త పాలసీ దోహదం చేస్తుందనీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ కొత్త పాలసీని రూపొందించామని మంత్రి మేకపాటి గౌతవ్‌ు రెడ్డి ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే వివిధ రంగాల్లో ‘కొత్త పాలసీలు’ చూసిన రాష్ట్ర ప్రజానీకం, ఈ కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కన్పించడంలేదు.

కొత్త ఇసుక పాలసీ ఏమయ్యిందో చూశాం. కొత్త మద్యం పాలసీ ఎలా తయారైందో చూస్తూనే వున్నాం. కొత్త పాలసీ పేరుతో ఇసుక లభ్యతను కొన్నాళ్ళపాటు తగ్గించేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కొత్త పాలసీ తీసుకొచ్చాక కూడా ఇసుక కొరతని అలాగే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా పడకేసిన మాట వాస్తవం. మరోపక్క, మద్యం పాలసీ పరిస్థితీ అలాగే తయారయ్యింది. మద్యం ధరల్ని పెంచేయడంతే, మందుబాబులు శానిటైజర్లను, నాటు సారానీ, కల్తీ కల్లునీ ఆశ్రయించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఏ పాలసీకి ఆ పాలసీనే పెద్ద ఫెయిల్యూర్‌గా మారిపోతున్న దరిమిలా, ఇండస్ట్రియల్‌ పాలసీ పేరుతో కొత్త పబ్లిసిటీ స్టంట్‌ అవసరమా.? అన్న ప్రశ్న విపక్షాల నుంచే కాదు, సాధారణ ప్రజానీకం నుంచి కూడా ఉత్పన్నవుతోంది.

అయితే, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వాలు కొత్త కొత్త పాలసీలు ప్రకటించడం మామూలే. కానీ, ఇక్కడ పాలకుల్లో చిత్తశుద్ధిని బట్టే ఆయా పాలసీలు హిట్టవుతాయా.? ఫట్లవుతాయా.? అన్నది తేలుతుంది. రాష్ట్రంలో రాజధాని పేరుతో సంక్షోభం కొనసాగుతోంది. రాజధాని విషయంలో కొనసాగుతోన్న ఈ సంక్షోభం పారిశ్రామికాభివృద్ధికి పూర్తిగా ఇబ్బందికరం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఏడాది కాలంగా రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్నదానిపై గందరగోళాన్ని కొనసాగిస్తోన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, మూడు రాజధానుల విషయంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటోన్న విషయం విదితమే.

వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళిన దరిమిలా.. ఈ అంశంపై ఎప్పుడు స్పష్టత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ తరుణంలో ఇండస్ట్రియల్‌ పాలసీ.. అంటూ కొత్త ప్రచారం షురూ చేసినా, దాని వల్ల పెద్దగా ఉపయోగం వుండకపోవచ్చు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు మొగ్గు చూపుతుండడం, అభివృద్ధి మీద శీతకన్నేయడం.. ఇవన్నీ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది నిర్వివాదాంశం.

ఏపీలో కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ.. ఈసారేమవుతుందో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...