కేరళ విమాన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందినట్లుగా అధికారులు దృవీకరించారు. అయితే స్థానికులు వెంటనే సాయం చేసేందుకు ముందుకు రాకుంటే ఖచ్చితంగా ఈ సంఖ్య పెరిగి ఉండేది అంటున్నారు. పెద్ద శబ్దం రావడంతో చాలా మంది స్థానికులు అక్కడకు చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మొదట విమానాశ్రయ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు.
కాని ప్రమాధ తీవ్రత మరింత ఎక్కువ కాకుండా ఉండాలంటే అక్కడ నుండి గాయపడ్డ వారిని మృత దేహాలను అక్కడ నుండి తరలించారు. ఏ క్షణంలో అయినా విమానం కాలి బూడిద అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా స్థానికులు భయపడకుండా అక్కడకు చేరుకున్నారు.
సీఎం విజయన్ కూడా స్థానికుల పాత్రపై అభినందనలు కురిపించారు. కరోనా భయం లేకుండా స్థానికులు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. విమాన ప్రయాణికుల్లో కరోనా పేషంట్లు ఉండే అవకాశం ఉంది. అయినా కూడా స్థానికులు సాయం చేసేందుకు వచ్చారు. విమానాశ్రయ సిబ్బంది మరియు పోలీసులతో కలిసి స్థానికులు చేసిన సాయం ఎప్పటికి మర్చి పోలేనిది అంటూ ఈ ప్రమాదంలో గాయపడ్డ ఒక వ్యక్తి అన్నారు.
వారు వెంటనే ఆసుపత్రికి తరలించి ఉండకుంటే ఖచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేది అంటూ ప్రభుత్వ వర్గాల వారు కూడా అంటున్నారు. నిబందనల ప్రకారం ఆ సాయం చేసిన స్థానికులు అంతా కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.
867243 907945Woh I really like your posts , bookmarked ! My wife and i take issue along together with your last point. 230730
576118 161970Youre so appropriate. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a complete new view of this. I didnt realise that this issue was so important and so universal. You absolutely put it in perspective for me. 388910