అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ స్క్రిప్టు చేతిలో వున్నాగానీ, మాటల్లో తప్పులు దొర్లేస్తున్నాయ్.?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నరక యాతన అనుభవించారు.. అదీ ప్రసంగించే సమయంలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో నాలుగు పెళ్ళిళ్ళు.. నాలుగు నియోజకవర్గాలంటూ తప్పులో కాలేశారు వైఎస్ జగన్.
పాలకొల్లు, భీమవరం, గాజువాక.. ఇప్పుడు పిఠాపురం.. ఇలా నాలుగు నియోజకవర్గాలంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించేసరికి, అదే వేదికపై వున్న వైసీపీ నాయకులంతా ఒక్కసారి విస్తుపోయారు.
నిజానికి, పాలకొల్లులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసింది లేదు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి జనసేనాని పోటీ చేశారు. ప్రస్తుతం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు.
ఎందుకంటే, వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, విశాఖ నుంచి పోటీ చేసి గతంలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అన్నట్టు, విజయమ్మ విశాఖకు లోకల్ కాదు.. నాన్ లోకల్.! మరి, పవన్ కళ్యాణ్ని పిఠాపురం నియోజకవర్గానికి నాన్ లోకల్.. అంటూ వైఎస్ జగన్ ఎలా వ్యాఖ్యానించగలిగారు.?
పవన్ కళ్యాణ్కి ఏ భార్య అన్నా ప్రేమ లేదంటూ వైఎస్ జగన్ ఇంకో ఆణిముత్యం కూడా వదిలారు. ‘నేను నాలుగో పెళ్ళి చేసుకోలేదు.. నాకు నాలుగో పెళ్ళాం లేదు. పదే పదే నాలుగో పెళ్ళి, నాలుగో పెళ్ళాం అంటున్నావ్.. రా జగన్, నువ్వే నా పెళ్ళానివి..’ అని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మీద కౌంటర్ ఎటాక్ వేసిన సంగతి తెలిసిందే.
మరోపక్క, వైఎస్ జగన్ బస్సు యాత్ర సందర్భంగా యువత నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. ఓ కళాశాల వద్ద వైసీపీ అప్పటికే ఏర్పాటు చేయించిన పెయిడ్ విద్యార్థుల హంగామా ఓ వైపు నడుస్తోంటే, అసలు విద్యార్థులం తామేనంటూ కొందరు విద్యార్థులు, వైఎస్ జగన్కి వ్యతిరేకంగా నినదించారు. దాంతో, వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి.
అన్నట్టు, వైఎస్ జగన్ బస్సు యాత్రకు జనాన్ని సమీకరించడం స్థానిక వైసీపీ నేతలకు తలకు మించిన భారం అవుతోంది.!
ఇంతకీ, వైఎస్ జగన్కి స్క్రిప్టు రాసిస్తున్నదెవరు.? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గమంటూ పాలకొల్లు పేరుని ఆ స్క్రిప్టులో ఎందుకు రాశారు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తప్పులు మాట్లాడించాలనే ప్రయత్నమా.? ఆ మాత్రం ‘జ్ఞానం’ కూడా లేకుండా వైఎస్ జగన్, ఎలా తప్పులు చదివేశారు.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్నలే.
ఒక్కటి మాత్రం నిజం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్టుకి బందీగా మారిపోయారు. ముఖ్యమంత్రి అయ్యాక, వైఎస్ జగన్ ప్రెస్ మీట్లు పెట్టలేకపోవడానికి ఇదీ ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకీ దుస్థితి.? అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది.?