దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. రెండు మిలియన్ ల సంఖ్యను భారత్ అధిగమించింది. దేశంలో కరోనా కేసుల్లో ఏపీ టాప్లో ఉంది. దేశంలో మూడవ స్థానంలో ఏపీ నిలవడం దారుణం అంటున్నారు.
ఏపీలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెళ్లడయ్యింది. వారు ఏపీలో పలు చోట్ల సర్వే నిర్వహించి ఈ విషయాన్ని నిర్థారించారు.
ఇతర రాష్ట్రాల్లో కొన్ని ముఖ్య పట్టణాల్లో మాత్రమే కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాని ఏపీలో మాత్రం మొత్తం 13 జిల్లాల్లో సమానంగా కేసులు పెరుగుతున్నాయి.
ఏపీలో కరోన కేసుల పరిస్థితి చూస్తుంటే మరీ దారుణంగా ఉందంటున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడంతో పాటు కరోనా కట్టడి విషయంలో సరైన అవగాణను అధికారులు మరియు ప్రజల్లో కల్పించడంలో విఫలం అయ్యారు.
ప్రభుత్వం కరోనా రోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కూడా సరైనది కాదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రస్తుతం రెండున్నర లక్షలు చేరువ అయ్యాయి.
ప్రతి రోజు దాదాపుగా పది వేల కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో పరిస్థితి చేయి దాటి పోయిందంటూ ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడిలో మేము చాలా ముందు ఉన్నాం అంటూ ప్రకటించుకుంటున్నారు.
600591 580959I like this internet weblog very considerably so considerably superb info . 286598
Paragraph writing is also a excitement, if you be acquainted with
afterward you can write or else it is complicated to write.