Switch to English

చిరంజీవి ఒరిగిపోలేదు, ఒధిగిపోయారు: కళ్యాణ్ దిలీప్ సుంకర

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘‘మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందర ఒరిగిపోయారు. తన స్థాయిని తగ్గించేసుకుని మరీ, ముఖ్యమంత్రిని పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని దేబిరించారు, చేతులు జోడించి మరీ వేడుకున్నారు..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా మొసలి కన్నీరు కార్చుతున్నారు చాలామంది.

ఈ విషయమై కళ్యాణ్ దిలీప్ సుంకర, తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ఎలా గుర్తింపు కోసం దేబిరించేదీ తనదైన ఛమక్కులతో వివరించారు, సెటైర్లు దంచేశారు. చిరంజీవి ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర అలా ‘ఒదిగిపోయి’ వ్యవహరించారో చెప్పుకొచ్చారు.

నిజానికి, చాలామంది చిరంజీవి అభిమానులు కూడా, తమ అభిమాన నటుడు అలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర చేతులు జోడించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయితే, కార్యసాధకుడు తాను వెళ్ళిన పనిని సజావుగా పూర్తి చేసుకోవాలనుకునే క్రమంలో ఎలా ఒదిగి వుండాలో, అదే చిరంజీవి చేశారన్నది కళ్యాణ్ దిలీప్ సుంకర అభిప్రాయం.

నిజమే, చిరంజీవి తన సమస్య గురించి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళలేదు. సినీ కళామతల్లి బిడ్డగా, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వివరించడానికి వెళ్ళారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు చిరంజీవి ఒరిగిపోయారనడం కంటే, ముఖ్యమంత్రి అనే పదవి ముందు ఆయన ఒదిగి వ్యవహరించారన్నది సరైన పోలిక. అదే విషయాన్ని కళ్యాణ్ దిలీప్ సుంకర స్పష్టంగా పేర్కొన్నారు.

చిరంజీవిని అలా చూడటం కేవలం ఆయన అభిమానుల్నే కాదు, చిరంజీవి వెంట వెళ్ళిన మహేష్, ప్రభాస్ తదితరులకూ ఒకింత బాధగా అనిపించినట్టుంది. అందుకే, చిరంజీవి చొరవ వల్లనే పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి అలా చొరవ చూపించేందుకు ఎంత కష్టపడిందీ మహేష్, ప్రభాస్ తమ మాటల్లో పేర్కొన్నారు.

కాగా, తన వీడియోలో కళ్యాణ్ దిలీప్ సుంకర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి పట్ల కూడా సెటైర్లు వేశారు. ఆయన్ను కలిసేందుకు వెళ్ళిన వ్యక్తుల పట్ల ఒకింత నిర్లక్ష్యంగా, వెకిలిగా వైఎస్ జగన్ కనిపించారనీ, అయితే అది అతని సహజ వ్యవహార శైలి అయి వుండొచ్చని కళ్యాణ్ దిలీప్ పేర్కొన్నారు. ‘బహుశా అది అభద్రతాభావంతో అయి వుండొచ్చు..’ అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే విషయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...