Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్ కాలనీలో గురువారం ప్రేమ్ చంద్, సుశీల్ కుమార్ అనే వ్యక్తులు కొరియర్ వచ్చిందంటూ అమిత ఇంటికి వెళ్లారు. గుమ్మంలోకి వచ్చిన తల్లిని హెల్మెట్ ధరించిన వ్యక్తి తుపాకీతో బెదిరించాడు. ప్రేమ్ చంద్ పనిమనిషిని విలువైన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పాలని బెదిరించాడు.
ఈక్రమంలో సుశీల్ ను కాలితో తన్నింది అమిత. వెంటనే కుమార్తె వచ్చి అతడితో పెనుగులాడింది. తుపాకీ ఉన్నా వెరవకుండా పట్టుకునేందుకు తల్లీకూతుళ్లు విశ్వప్రయత్నం చేశారు. దీంతో తుపాకీ వదిలి సుశీల్ తుపాకీ వదిలి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వచ్చి ప్రేమ్ చంద్ ను పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. సుశీల్ ను కాజీపేట ఆర్పీఎఫ్ అదుపులోకీ తీసుకుంది. నిందితులు ఏడాది క్రితం అమిత ఇంట్లో పని చేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉండటం చూసి పని మానేశారు. పథకం ప్రకారం ఇప్పుడు దొంగతనానికి వచ్చారు.