త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. తమిళనాడులోని విరుదు నగర్ లోక్ సభ స్థానం నుంచి ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్( Radhika Sarathkumar) పోటీ చేయనున్నట్లు వెల్లడించింది.
2006 లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాధిక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏఐఏడిఎంకె పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీని వీడి 2007 లో తన భర్త శరత్ కుమార్ స్థాపించిన ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి (AISMK) కి ప్రెసిడెంట్ గా పని చేశారు. ఈ ఏడాది మార్చి 12న ఆ పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేశారు.