ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో ప్రమాదం తప్పింది. అక్కడున్న జనసేన కార్యకర్తలు అప్రమత్తమై దుండగున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడలో శనివారం వైఎస్ఆర్సిపి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర లోనూ ఇలాంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయం అయింది. ఆ ఇన్సిడెంట్ మరవకముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.