దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ ఉందా లేదా అనే అనుమానాలు కలిగేలా జనాలు బయట తిరుగుతున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా కూడా అన్ని జరగాల్సినవి జరిగేస్తున్నాయి. కనుక లాక్ డౌన్ విషయంలో మళ్లీ ఆలోచించాల్సిన అవసరం లేదని లాక్డౌన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని దిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జులై 31 వరకు లాక్డౌన్ అమలులో ఉండబోతుంది అంటూ వచ్చిన వార్తలపై దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన సత్యేందర్ జైన్ మళ్లీ లాక్ డౌన్ అయితే ఉండదు అంటూ పేర్కొన్నాడు. లాక్ డౌన్ను పొడగించేది లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. రీలాక్ దిల్లీ అనే పదం ట్రెండ్ లో ఉన్న కారణంగా మంత్రి ఈ ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 34 వేల మార్క్ను దాటేసింది. జులై 31 నాటికి దిల్లీలోనే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 5.5 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
510515 983603Most what i read online is trash and copy paste but i think you offer something different. Maintain it like this. 31470