Switch to English

భారత్‌లో కరోనా 3 లక్షలు: నెక్స్‌ట్‌ ఏంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,456FansLike
57,764FollowersFollow

‘ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చితే భారతదేశం పరిస్థితి మెరుగ్గానే వుంది.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..’ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విషయంలో కేంద్రం పదే పదే చెబుతున్న మాట ఇది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. నిన్న అత్యధికంగా.. అంటే, 10 వేలకు పైగా కేసులు.. (దాదాపుగా 11 వేల కేసులు) నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.

దేశంలో 130 కోట్ల మంది ప్రజలుంటే, అందులో ఇప్పుడు కరోనా వచ్చింది 3 లక్షల మందికి మాత్రమేనని లైట్‌ తీసుకునే పరిస్థితి వుందా.? ఛాన్సే లేదు. ‘ఢిల్లీ, హైద్రాబాద్‌, చెన్నయ్‌, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువ వుండొచ్చు.. అమెరికా స్థాయిలో మన దేశంలో పరీక్షలు జరిగితే, అమెరికా కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు బయట పడేవి..’ అంటూ కొందరు నిపుణులు చెబుతున్న మాటలు.. అందర్నీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

తక్కువ కేసులున్నప్పుడు కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేసి.. కేసుల తీవ్రత పెరిగాక లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చేయడంపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇంకోసారి లాక్‌డౌన్‌ని దేశంలో విధించే పరిస్థితే లేదు. ఇష్టం లేకపోయినా కరోనా వైరస్‌తో మనం సహజీవనం చేయాల్సిందే. ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెబుతాయి.. ప్రజలే తమ ప్రాణాల పట్ల బాధ్యత తీసుకోవాల్సి వుందిప్పుడు.

ఒక్క రోజులో 11 వేల కేసులంటే చిన్న విషయం కాదు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరగబోతోంది. ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’ లేదని కేంద్రం చెబుతున్నా, లింకులు లేకుండా నమోదవుతున్న కేసుల్ని చూస్తే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఓ వైపు లాక్‌డౌన్‌ కారణంగా సగటు భారతీయుడు తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి నెట్టివేయబడ్డాడు. ఇంత పెద్ద త్యాగం చేశాక ఇప్పుడేమో.. లాక్‌డౌన్‌ని ఎత్తేసి, కరోనా వైరస్‌తో సహజీవనం చేయమని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

సాటి మనిషిని నమ్మలేని దుస్థితి దాపురించింది కరోనా కారణంగా. పాతాళానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశమే కన్పించడంలేదు. దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేయబోతోంది. అయినా, కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పబ్లిసిటీ స్టంట్స్‌కే పరిమితమవుతున్నాయి. కరెంటు బిల్లులు, పెట్రో బాదుడు.. ఇవి కరోనా కంటే దారుణంగా సామాన్యుడ్ని చిదిమేస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం. ఒక్క ఢిల్లీలోనే రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ కేసులు 5 లక్ష లనుంచి 10 లక్షల వరకు నమోదవనున్నాయనే వాదనలు తెరపైకొస్తున్నాయంటే.. దేశంలో కరోనా ఎన్ని కోట్ల మందికి వ్యాపిస్తుందో ఏమో.. తలచుకుంటేనే ‘లెక్కలు’ గుండెల్ని పిండేస్తాయ్‌ మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...